కాషాయ అగ్రనేతల భేటీ..

బీజేపీ సీనీయర్ నేతలు మురళీ మనోహర్ జోషి నివాసంలో భేటీ అయ్యారు. వృద్ధనేత అద్వానీ, శాంతకుమార్, యశ్వంత్ సిన్హాలు ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ ఎంపీ కీర్తీ ఆజాద్ సస్పెండ్ పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. డీసీసీఏ నిధులు దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.