ఐక్య పోరాటాలతోనే పౌర హక్కులకు రక్షణ

సచివాలయ నిర్మాణ పనుల్లో చట్టాలను అమలు చేయాలని, నిర్భంధాలు వద్దనే డిమాండ్లతో గుంటూరులో రాజకీయ, ప్రజా కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ, తాత్కాలిక రాజధాని పేరుతో కార్మికులతో కార్పొరేట్‌ కంపెనీలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని విమర్శించారు.. రాజధాని నిర్మాణ అంశం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని ఎండగట్టాలన్నారు