ఉచిత విద్య ఊసు మ‌ర‌చిన ప్ర‌భుత్వం తీరుస్తోంది కార్పోరేట్ ధ‌న‌దాహం

ఇప్పుడు దేశమంతా ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ హోరెత్తుతోంది. ఎక్కడెక్కడి పెట్టుబడిదార్లూ వచ్చి పెట్టుబడులు కుమ్మరించి వస్తూత్పత్తి చేస్తే చవకగా యువనిపుణుల్ని అందిస్తామని దేశదేశలూ తిరిగి మన ప్రధానమంత్రి ఆహ్వానించి వస్తున్నాడు.
ఇక తొందరలో దేశంలో మూడవస్థానం, ఆ తర్వాత ప్రపంచంలో అగ్రస్థానం పొందే దిశగా ‘అభివృద్ధి’ తారకమంత్రంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్య మంత్రి వారానికో దేశం తిరిగి చెబుతున్నాడు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రపంచాన్ని శాసించిన తెలుగు యువకులు రాష్ట్రాన్ని "Knowledge Hub"గా మార్చబోతున్నారని ఊరిస్తున్నాడు.
ఇద్దరిదీ యువతపై దృష్టి. వారి నైపుణ్యాపై దృష్టి. వారి సామర్ధ్యాపై దృష్టి. ఈ యువతే మన అభివృద్ధికంతా లమూలం.
ఇదంతా ఒప్పుకొంటే మరి వారి ఎదుగుదల‌ అంతా విద్య మీదనే గదా ఆధారపడి వుంటుంది. మరి ఆ రంగాన్ని పాకులెలా చూస్తున్నారు? అందులో మనమెక్కడ వున్నాం?
విద్యారంగం దగ్గరికొచ్చేప్పటికి అది ప్రాథమిక విద్యగావచ్చు, విశ్వ విద్యాల‌య విద్యగా వచ్చు ఆంధ్రప్రదేశ్‌ అంధఃపాతాళంలో వుంది. పాఠశాల‌ విద్యల్లో మనది అక్షరాలా 33వ స్థానం! ప్రైవేట్‌రంగంలో ఎక్కువమంది పిల్ల‌లు చదివే రాష్ట్రాల్లో మనది మొదటి స్థానం. ఒక లెక్కన మన ప్రజలు తమ పిల్ల‌ల్ని పాఠశాల‌ విద్య కోసం ఏడాదికి రూ.9000కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంటర్మీడియేట్‌ విద్య సర్వం కార్పొరేట్‌ హస్తగతమై, రెండే రెండు సంస్థ చేతుల్లో 70% పిల్ల‌లు చదవడం ప్రపంచంలో ఎక్కడాలేని వికారం. మన ఇంజనీరింగ్‌ కాలేజీల్లో డిగ్రీలు పుచ్చుకొన్న యువకుల్లో కేవలం 13% మందికి మాత్రమే చదువుకుతగ్గ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇలాంటివి మన రాష్ట్రంలోనే సాధ్యం!