ఆత్మహత్యలు విషాదకరం :తరిగామి

కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను జమ్ము-కశ్మీర్‌ రాష్ట్ర సిపిఎం ఎమ్మెల్యే, ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమ నాయకుడు యూసఫ్‌ తరిగామి సోమవారం పరామర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన 16 మాసాల్లో అనంతపురం జిల్లాలో 39 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు.