అసభ్యతే AAP ప్రామాణికతా?

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌తో సహా ఆప్‌ నేతలపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ విరుచుకుపడ్డారు. డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ గత కొద్దిరోజులుగా జైట్లీని లక్ష్యంగా చేసుకుని ఆప్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో గురువారం జైట్లీ ఎదురుదాడి చేశారు. 'ఢిల్లీ అసెంబ్లీలో, వెలుపల ప్రధానిని ఇతరులనుద్దేశించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనలేంటి? భారత ప్రభుత్వ అధికారులెవరైనా అటువంటి భాషను ఉపయోగిస్తారా? ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించాయి. అధికారంలో వున్నవారు కాస్తంత సంయమనం పాటించాలి. వారు విపరీతంగా వ్యవహరించకూడదు. అసభ్యంగా వ్యవహరించే, మాట్లాడే హక్కు వారికి లేదు అని ఘాటుగా స్పందించారు