ఖజానా నింపుకోడానికే ప్రభుత్వం:మధు

విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మృతి చెందటానికి ప్రభుత్వ మద్యం విధాన మే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఖజానా నింపుకో వటమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింద న్నారు. మృతుల కుటుం బాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరి హారం చెల్లించాలని ఆయన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బాధితు లకు ఉన్నత వైద్య సౌకర్యం అందించాలని కోరారు.