ఆర్టికల్స్

' మన్‌ కీ బాత్‌ ' మహామాయ

 ప్రజలందరూ తనను దేశ ప్రధానిగా చేశారని, తనలోని సాధారణ మనిషి లక్షణాల వల్ల కొన్నిసార్లు ప్రజల్లో ఒక్కడై పోతానని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు. 60 ఏళ్ళలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలో పూర్తి చేస్తామనడానికి ఎంతో ధైర్యం కావాలని గత నెల 28న ఆకాశవాణి ద్వారా ప్రచారమయ్యే మన్‌ కీ బాత్‌ (మనసులో మాట) కార్యక్రమంలో అన్నారు. తనను తానే గొప్పవాడిగా పొగుడుకునే వారికి ఎవరైనా పోటీలు నిర్వహిస్తే ప్రపంచంలో మోడీకి ప్రథమ బహుమతి లభించవచ్చు. మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడుతూ బేటీ బచావో, బేటీ పఢావో (బాలికను కాపాడండి, చదివించండి) అంటూ బాలికలను రక్షించడానికి ప్రచారం చేయలన్నారు. బేటీ పఢావో అంటున్న ప్రధాని దేశంలో అయిదు లక్షల ఉపాధ్యాయుల కొరత ఉంటే పేద పిల్లలకు విద్య...

'సాగు' సమస్యల సుడిగుండంలో కౌలు రైతులు

రాష్ట్రంలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయి. గత వ్యవసాయ లాభ నష్టా లు మరిచిపోయి ఎన్నో ఆశలతో 'సాగు' కదనరంగంలోకి దూకుతున్న 'సాగు' దారులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులున్నారు. సాగు భూమిలో 70 శాతం పైగా వీరే సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, తదితర జిల్లాల్లో వ్యవసాయరంగంలో కౌలు రైతులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారి సమస్యలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధా నంగా రుణమాఫీ కాక, కొత్త రుణాలు అందక, రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇవ్వక, పెరిగిన కౌలురేట్లు, ఎరువులు, విత్తనాలు,...

ఉత్తి మాటలతో విద్యరాదు

రాజమండ్రిలో 2015 జులై 22న జరిగిన ప్రాంతీయ విద్యా సదస్సులో మీరు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి పలు నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేశారు. సంతోషం. రాష్ట్ర అభివృద్ధికి విద్యాభివృద్ధి ఎంతో కీలకం. నేడు మన రాష్ట్రంలో అక్షరాస్యత 67.41 శాతం మాత్రమే ఉంది. రాష్ట్ర సగటు కంటే ఆరు జిల్లాలు, దేశ సగటు అక్షరాస్యత (74.04 శాతం) కంటే 12 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. విజయనగరం, కర్నూలు జిల్లాల్లో 60 శాతం కూడా లేదు. రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలన్నారు. సుమారు 60 ఏళ్ళలో సాధించలేనిది నాలుగు సంవత్సరాలలో సాధించడం సాధ్యమా? దానికి తగిన ప్రణాళిక ఏది? నిధులు ఏవి? అవి ప్రకటించకుండా ఆదేశాలు జారీ చేయడం ప్రజల్ని మభ్య పెట్టడమే కదా!
ఇప్పటికీ 50 శాతం...

ఒక తప్పును కప్పిపుచ్చడానికి...

 తప్పు జరిగినప్పుడు ఒప్పుకుంటే ఆ ఒక్క తప్పుకే పరిమితం కావొచ్చు. అదే తప్పును కప్పిపుచ్చుకోవాలనుకొంటే మాత్రం తప్పు మీద తప్పు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రప్రభుత్వం ఆ రెండవ పనిలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నది. గోదావరి పుష్కరాల తొలిరోజున జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులు-అన్నీ తానై పుష్కర ఏర్పాట్లు చూసిన సిఎం, ఆయన మంత్రివర్గ అనుచరులు కాదట! వి.వి.ఐ.పిలు, వి.ఐ.పిల సేవలో తరిస్తూ ప్రజా భద్రతను, బాధ్యతను గాలికి వదిలిన అధికారులూ కాదట! పుష్కర ఘాట్‌లో వ్యాపించిన ఒకానొక వదంతి కారణంగా ఆ ఘోరం జరిగిందట. అదే విధంగా ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న వారిని అడ్డుకోబోయిన...

బిసి సబ్‌ప్లాన్‌ ఎందుకు?

అన్ని స్థాయిల్లోని నిర్ణాయక స్థానాల్లో, ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న అన్ని వ్యవస్థల్లో, సంపద, మౌలికరంగాలపై ఆధిపత్యంలో బిసిలు పూర్తిగా అధమస్థానంలోకి నెట్టబడ్డారు. ఇప్పటికీ ఉత్పాదకను అందిస్తూ అత్యధిక స్వయం ఉపాధితో దేశ అభివృద్ధికి బిసిలు తోడ్పడుతున్నారు. దానికి తోడు చట్టసభల్లో కేవలం 18 శాతం స్థానాలు, పాలనా వ్యవస్థ లోని పై స్థాయి ఉద్యోగుల్లో 8 శాతం, న్యాయశాఖలో 6 శాతం, దేశంలోని అతిపెద్ద వెయ్యి కంపెనీల్లోని నిర్వహణా బోర్డులలో 3 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యానికి పరిమితమయ్యారు. 
భారత రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలం దరికీ జాతి, వర్ణ, కుల, వర్గ, లింగ వివక్ష లేకుండా సమాన త్వాన్ని, సమాన అవకాశాలను కల్పిస్తానని హామీ నిచ్చింది. ఈ లక్ష్యంతోనే...

ఆదర్శ పాఠశాలల అసలు నిజాలు

''ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాస్వామిక ప్రభు త్వాలు విద్యారంగం మీద సామాజిక అభివృద్ధి దృక్పథంతో పెట్టుబడులు పెట్టినప్పుడే నిరక్షరాస్యతా మహమ్మారిని పారద్రోలగలమని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని సెనెగల్‌ రాజధాని డాకర్‌లో 2000లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సు తీర్మానించింది.'' తీర్మానాన్ని మన దేశం కూడా ఆమోదించింది. కానీ నేడు మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అపసవ్య విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తోంది. ప్రత్యేకించి మన రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌కు విద్యారంగంలో ప్రాథమిక స్థాయిలో ధీటైన విధానాలతో గట్టి పునాదులు వేసి...

రెండంకెల వృద్ధి సాధ్యమా..!

రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖా మంత్రి వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి (డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌) సాధిస్తామనీ, దానికోసం అన్ని ఏర్పాట్లూ చేశామనీ ప్రచార హోరు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తే 'ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు' ఉంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని అరికట్టలేని ప్రభుత్వం మరి రెండంకెల ప్రగతి గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? గడిచిన దశాబ ్దకాలంలో కనీసం 4 శాతం వృద్ధి రేటు సాధించలేక పోయాము. ఇప్పుడు ఏకంగా రెండంకెల ప్రగతి సాధిస్తామని చెబుతున్నారు. దేశంలో 4 శాతం వ్యవసాయ రంగం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకుం టున్నా దానిని కూడా చేరకుండా ఏయేటికాయేడు దిగజారిపోతున్నది. దేశ జనాభా ఏటా 1.9...

చతికిలపడుతున్న చిన్నపరిశ్రమల రంగం

పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించే చిన్న పరిశ్రమల పరిస్థితి నయా ఉదారవాద విధానాల యుగంలో పరమ అధ్వానంగా తయారైందని ఎంతమంది మొత్తుకున్నా పెడ చెవిన పెట్టిన పాలకులకు సరికొత్త సర్వేలు కళ్ళు తెరిపిస్తాయి అనుకోవాలి. చాలా పరిశ్రమలు ఇప్పటికే దివాళా తీయగా, మరి కొన్ని ఈసురోమంటూ మూతపడే దిశలో వున్నాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మేక్‌ ఇన్‌ ఇండియా ఆచరణలో సేల్‌ ఇన్‌ ఇండియాగా మారిపోయింది. గడచిన ఏడాది కాలంలో దేశంలో 61వేలకు పైగా చిన్న పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడినట్లు కార్పొరేట్‌ వ్యవహారాలను స్వయంగా చూస్తున్న కేంద్ర ఆర్థికశాఖామాత్యులు జైట్లీ మహాశయుడే మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో...

క‌ళంకిత క‌మ‌లం

అ...అమ్మ, ఆ...ఆవు' అని చెప్పుకునే రోజులు పోయాయి. 'అ...అవినీతి, ఆ...ఆశ్రిత పక్షపాతం' అనుకోవాల్సిన కాలం వచ్చేసింది. మాది భిన్నమైన పార్టీ. స్వచ్ఛమైన పార్టీ అంటూ జనాన్ని నమ్మించి మరీ గద్దెనెక్కిన బి.జె.పి వారూ తక్కువ తినలేదని నిరూపితమౌతోంది. మోడీ గేట్‌, వ్యాపమ్‌ స్కామ్‌, చిక్కీ కుంభకోణం, అగ్నిమాపకాల కొనుగోళ్ల స్కామ్‌ ఓ వైపు, నకిలీ సర్టిఫికెట్లు- అక్రమ చదువుల ఆరోపణలు మరోవైపు కమలనాథులకు పట్టపగలే చుక్కలు చూయిస్తున్నాయి. 

ఏడాది కిందట కేంద్రంలో గద్దెనెక్కింది భారతీయ జనతా పార్టీ (బి.జె.పి). గత పార్టీలకు తమకు నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందని ఊదరగొట్టేసింది. అసలు అవినీతికి స్పెల్లింగే తెలీదన్నట్టు అదరగొట్టేసింది. నల్లధనం...

మున్సిపల్‌ సమ్మె పట్ల దళిత సంఘాల వైఖరేంటి?

 రాష్ట్రంలో గత 12 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు, మున్సిపల్‌ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించమని కోరుతూ సమ్మె చేస్తున్నారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదించిన తరువాత, పలుమార్లు అధికారులతో చర్చలు జరిగిన తరువాత అధికారుల, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. మున్సిపల్‌ ఉద్యోగులు సంప్రదాయకంగా దళిత కులానికి చెందినవారే. ఒకప్పుడు నూటికి నూరు శాతం దళితులే పారిశుధ్య కార్మికులుగా పనిచేసేవారు. కానీ ఇటీవల ఇతర కులాల నుంచి కొంతమంది వేరే బ్రతుకుదెరువు లేక పారిశుధ్య కార్మికులుగా వస్తున్నారు. వీరు గనుక పారిశుధ్య...

కలల రాజధాని

యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ సంస్థ రూపొందించిన సీడ్‌ కాపిటల్‌ నమూనాను 70 ఎంఎం టెలిస్కోప్‌లో చూపించి యావదాంధ్ర ప్రజలకు కనువిందు కలిగించారు. చంద్రబాబు నాయుడు చూపించిన రాజధాని ప్రణాళికలో కలల రాజధానిపై కలలుగనేవారికీ, కలలతో వ్యాపారం చేసుకునేవారికీ కావాల్సిన హంగూ ఆర్భాటాలన్నీ పుష్కలంగా వున్నాయి. 7, 325 చ. కమి. మీ . విస్తీర్ణంలో నిర్మించే మూడంచెల రాజధానిలో 16.9 చ.కి.మీ వైశాల్యంలో మొదట ఈ సీడ్‌ కేపిటల్‌ సిటీని ఏర్పాటు చేయనున్నారు. సోమవారం రాజమండ్రిలో సింగపూర్‌ మంత్రి ముఖ్యమంత్రికి అందజేసిన సిటీ నమూనా ఆంధ్రుల రాజధాని అమరావతి నగరి రూపురేఖలను కళ్లకు...

విద్యా సంస్థలపై RSS డేగ కన్ను

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని రాజకీయ పక్షం బిజెపిని ఎవరైనా విమర్శిస్తే నేరుగా వారికి హిందూ విరోధులనే బిరుదిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించినా, వ్యతిరేకించినా వారిని భారత విరోధులని ముద్ర వేయటం జరుగుతున్నది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి చెందిన ఏ నాయకుడో వెళ్ళగక్కిన విషం కాదు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార పత్రిక ఆర్గనైజర్‌లో అక్షరీకరించబడ్డ సూత్రం.
పూణేలో ఎఫ్‌టిఐఐ(ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌) విద్యార్థినీవిద్యార్థులు అక్కడి ఛైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ని నియమించటాన్ని నిరసిస్తూ నెలా పదిహేను రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దాంతో ఆ పత్రిక వారిని హిందూ విరోధులంటూ ఒక వ్యాసంలో రాసింది. ఈ ఉద్యమం పట్ల సంఘ...

Pages