ఆర్టికల్స్

అంగన్‌వాడీలకు వెన్నుపోటు..

అంగన్‌వాడీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమానవీయంగా ప్రవర్తిస్తూ వారి ఉసురు పోసుకుంటున్నాయి. మాతా శిశు సంక్షేమంలో, శిశు, బాలింత మరణాల నివారణలో ప్రపంచంలోనే అథమస్థాయిలో ఉండి కూడా వారికి కాస్తంత ఊరట కల్పిస్తున్న ఐసిడిఎస్‌ నిర్వీర్యానికి కేంద్రంలో బిజెపి సర్కారు కుయుక్తులు పన్నుతుండగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అదే బాటలో నడుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణే కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను ఒంటి చేత్తో ఈదుతున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం హామీ ఇచ్చి తప్పించుకు తిరుగుతోంది. అంగన్‌వాడీల దశలవారీ పోరాటాలతో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన బాసను తప్పేందుకు కనిపించిన...

సింగపూర్‌ చంద్రబంధంలో అమరావతి

 ఆలూలేదు, చూలూ లేదు అమరావతి అంతర్జాతీయ నగరం అని ఆర్భాటం చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం-ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కల్పించిన భ్రమలూ, చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 'సింగపూర్‌ కంపెనీల గొంతెమ్మ కోర్కెలు' శీర్షికతో ఈనాడు పత్రిక డిసె ంబర్‌ 11న ఇచ్చిన వార్త దీనికొనసాగింపే. ఆ వెంటనే సదరు వార్తను సమతుల్యం చేసేందుకన్నట్టు ఆంధ్రజ్యోతి మరో వార్తా కథనం ప్రచురించింది. వాస్తవంగా అమరావతి నిర్మా ణ ప్రణాళిక ఖరారు దగ్గరకు వచ్చేసరికి సింగపూర్‌ కంపెనీల ప్రవర్తన ఎలా ఉన్నదో మొదటి కథనం వివరిస్తే- అలాటి మార్పులేమీ లేనట్టు, అంతా సుభిక్షంగా జరిగిపో తున్నట్టు చిత్రించేందుకు రెండవ కథనం ప్రయత్నించింది. మరేదైనా పత్రికలో వచ్చి ఉంటే ఈ కథనాలకు...

అప్రజాస్వామిక కమిటీలు..

 జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలన నిర్వహిస్తున్న తీరు అప్రజాస్వామికం, దుర్మార్గం. ఏ మాత్రం చట్టబద్ధత కానీ, రాజ్యాంగబద్ధత కానీ లేని ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో సర్వం తామే అయి వ్యవహరిస్తున్న విధానం విస్మయాన్ని కలిగిస్తోంది. రేషన్‌ కార్డులు, ఫించన్ల నుండి వరద సాయం వరకు క్షేత్రస్థాయిలో అన్ని అంశాల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో స్థానిక సంస్థలు నామమాత్రంగా మారుతున్నాయి. జన్మభూమి కమిటీల నీడలో ఉనికి కోల్పోతున్న స్థానిక సంస్థల ప్రతినిధులు తమ హక్కుల కోసం ఎలుగెత్తాల్సిన స్థితి వచ్చినా రాష్ట్ర సర్కారులో చలనం లేకపోవడం చూస్తుంటే అస్మదీయులకు లబ్ధి చేకూర్చే రంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగా పట్టుకుందో అర్థమవుతోంది. స్థానిక...

రైతు ఉద్ధరణ ఇలాగా?

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు తయారైంది పత్తి రైతుకు ప్రభుత్వం కల్పిస్తామన్న మద్దతు ధర. ఇంకేముంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేశాం పంట తేవడమే ఆలస్యం అని సర్కారీ పెద్దలు ఆశ పెట్టడంతో నిజమేననుకొని పత్తిని మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లిన రైతులు కొనుగోలు జాడ లేక తెల్లబోతున్నారు. తిరిగి పంటను ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక దళారులకు అయిన కాడికి తెగనమ్ముకొని నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతులను రక్షించాల్సిన ప్రభుత్వమే వంచిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలీక గుండెలు అవిసేలా బోరుమంటున్నారు. రైతులంటే పాలకులకు ఎందుకంత అలుసో అర్థం కాదు. ఊరికి ముందే ఈ నెల 3న ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి పత్తి కొనుగోళ్లపై కొండంత రాగం తీయగా పక్షం రోజులు దాటాక అది...

అన్ని విధాలా ఆదుకోవాలి..

గోరుచుట్టుపై రోకటి పోటులా నిన్నటివరకు అనావృష్టితో బాధపడిన రాష్ట్ర్ర ప్రజలకు నేడు అతివృష్టి దెబ్బతీసింది. అల్పపీడనం ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఈ వర్షాలు ఆపార నష్టాన్ని కలిగించాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఊరు యేరూ ఏకమయ్యాయి. స్వర్ణముఖి, కాళంగి, కైవల్య, పంబలేరు కట్టలు తెంచుకు ప్రవహించడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. చెరువులకు గండ్లు, రోడ్లు, రైలు మార్గాలు కోతకు గురికావడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వర్ష బీభత్సాలకి ఇంతవరకు 13...

సామ్రాజ్యవాదపు వికృత శిశువు ఉగ్రవాదం..

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)..ఆ మధ్య జర్నలిస్టులకు నారింజ రంగు చొక్కాలు తొడిగి..ఏడారిలో కత్తులు ఝుళిపిస్తూ అతి క్రూరంగా గొంతుకలు తెగ్గోసి..ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో ఉంచి సంచలనం సృష్టించిన సాయుధ సంస్థ. 'మీ మిస్సైళ్లు మా మీద పడుతున్నంత కాలం..మా కత్తులు ఇలా గొంతులు కోస్తూనే ఉంటాయి' అని అమెరికా అధ్యక్షునికి హెచ్చరికలు పంపిన సంస్థ. ఇరాక్‌, సిరియాల తర్వాత జోర్డాన్‌, లెబనాన్‌లకు విస్తరించి, పాలస్థీనాను విముక్తం చేసి.. విస్త త ఖలీఫా రాజ్యం తెస్తామని, తర్వాత క్రమేపీ ప్రపంచమంతా ఖలీఫా రాజ్యం తేవాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది. అదే ఇప్పుడు పారిస్‌లో వరుసదాడులకు పాల్పడి ప్రపంచం ముంగిట పెను సవాలుగా నిలిచింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ...

ప్రమాదం తొలగిపోలేదు..

మన్యం ప్రజల బతుకుల్లో విషం చిమ్మే బాక్సైట్‌ జిఒ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం. గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందువల్లే అయిష్టంగానైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. మంత్రి మండలి సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు స్థానికంగా వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనను సుదీర్ఘంగా వివరించిన తరువాత, నిఘా వర్గాల నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించాక మరో మార్గం లేకే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నారన్నది దాచినా దాగని సత్యం! అయితే, ప్రజా సంక్షేమం కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేసే బాబు సర్కారు బాక్సైట్‌ ఖనిజాన్ని వెలికితీసే విషయంలో తన వైఖరిని పూర్తిగా మార్చుకోలేదు. అధికారంలోకి...

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అవశ్యం..

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 1950 జనవరి 26న రాజ్యాంగ సభలో మాట్లాడుతూ మనం వైరుధ్యాలతో కూడిన జీవితం ప్రారంభిస్తున్నాము. మనకు రాజకీయాలలో సమానత్వం ఉంది కానీ, సామాజిక, ఆర్థిక జీవితాలలో అసమానతలున్నాయి. రాజకీయాలలో ఒక మనిషికి ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాము. కానీ మనం సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరికీ ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరిస్తున్నాము. ఎంతకాలం ఈ వైరుధ్యాల జీవితం. ఈ వైరుధ్యాలను వీలైనంత త్వరగా అంతం చేయాలి. లేదంటే రాజ్యాంగ సభవారు కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలకు గురైనవారు పెకలించి వేస్తారని చెప్పిన మాటలను మన పాలకులు గుర్తుంచుకోవాలి. వారు పరిపాలనా విధానంలో మార్పులు చేస్తూ రాజ్యాంగంలోని సామ్యవాద...

ప్రపంచ కార్పొరేట్‌ పాలన దిశగా...

 పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై అనేక దేశాలతో చర్చించటం ద్వారా ఒక సరికొత్త ప్రపంచ పాలనా నిర్మాణాన్ని అమెరికా చేపడుతున్నది. ఈ ఒప్పందాలన్నీ అమలులోకి వస్తే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 80 శాతం వీటి పరిధిలోకి వస్తుంది. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా వీటి ఆధీనంలోకి వస్తుంది. అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు(బిట్సి, ట్రాన్స్‌అట్లాంటిక్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌(టిటిఐపి), ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌(టిపిపి)వంటివి) వీటిలో ఉన్నాయి. ఇందులో చేరాల్సిందిగా భారత్‌ను ప్రేరేపిస్తున్నందున ఈ నిర్మాణాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంది.
మూడు ముఖ్య లక్షణాలు
ఈ ఒప్పందాలలో కనీసం మూడు...

ఉగ్రవాదానికి అగ్రరాజ్యాలే ఆజ్యం..

ప్రపంచంలో కొన్ని అగ్రదేశాలు అనుసరిస్తున్న విధానాలే ప్రస్తుతం అన్ని దేశాలను వణికిస్తున్న ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నాయని సిపిఎం అధికార పత్రిక పీపుల్స్‌ డెమొక్రసీ తన తాజాసంచిక సంపాదకీయంలో విమర్శించింది. ప్రస్తుతం ప్రపం చం అంతా ఉగ్రవాదం నుండి పెనుముప్పును ఎదు ర్కొంటున్నదని, ఈ పెనుభూతాన్ని తరిమికొట్టి నిర్మూలించాలన్న విషయంలో ఎటువంటి సందే హమూ అవసరం లేదని పత్రిక ప్రధాన సంపాద కుడు ప్రకాశ్‌ కరత్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఉగ్ర వాద మూలాలను కనిపెట్టి వాటిని ఎదుర్కొనే విధా నాలు, పద్ధతులను అనుసరించటంలోనే అసలు సమస్య వస్తున్నదన్నారు. గత వారం పారిస్‌ నగ రంపై జరిగిన దాడులు, ఇతర దేశాలలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న మరికొన్ని దాడులను ఖండించే వారు అందుకు...

టిప్పు సుల్తాన్‌ జయంతిపై సంఘ్ పరివార్‌ రగడ..

చరిత్రను సంఫ్‌ు పరివార్‌ మతోన్మాద కళ్లద్దాలతో పరిశీలిస్తే అన్నీ తల్లకిందులుగానే కనిపిస్తాయి. దేశ రక్షణ కోసం పోరాడి యుద్ధభూమిలో నేలకొరిగిన వీరుడు ముస్లిం అయితే ఆయన దేశ భక్తుడు కాదు. విదేశీయులతో కుమ్మక్కయి దేశానికి ద్రోహం చేసిన వాడు హిందువు అయితే అతను మహా దేశభక్తుడవుతాడు. ప్రస్తుతం కర్ణాటకలో టిప్పుసుల్తాన్‌ జన్మదిన వేడుకలను వ్యతిరేకిస్తూ మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి-సంఫ్‌ు పరివార్‌ శక్తుల ధోరణి చూస్తుంటే కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ శక్తులు దేశాన్ని తాలిబానీకరించడానికి ఎంతగా తాపత్రయ పడుతున్నాయో అర్థమవుతుంది. 
మైసూర్‌ టైగర్‌గా పేరుగాంచిన టిప్పు సుల్తాన్‌ భారత దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాద...

''పాలకులే'' పీడకులైతే..

 ''పాలకులు మారినంత మాత్రాన ప్రజలకేమీ ఒరగదు. దోపిడీ వర్గాలు తమ సాంస్కతిక భావజాలాల ద్వారా ప్రజా జీవితాన్ని ప్రస్తుత దుర్భర స్థితిలోనే కొనసాగించడానికి సర్వప్రయత్నాలూ చేస్తూ ఉంటాయి. పీడితవర్గ పక్షపాత దక్పథం కలిగిన నాయకులు అధికారం చేపట్టాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది'' అని ఇటలీ తత్వవేత్త ఆంటోనియో గ్రాంసి అన్నారు. అతి పెద్ద దేశాలలో ఒకటైన మన దేశంలో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ పాలక ముఖ్యులు 'ముఖ్య కార్యనిర్వాహక అధికారులు'గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనే కాదు పార్టీలలోనూ ప్రజాస్వామ్యం అడుగంటింది. అందరూ రాజులుగా, చక్రవర్తులుగా నిజం చెప్పాలంటే నియంతత్వమే నిత్యకత్యంగా...

Pages